ETV Bharat / crime

బైకును ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

author img

By

Published : May 22, 2021, 5:30 PM IST

a bike hit by lorry at kancharlapalem
బైకును ఢీకొట్టిన లారీ

బైక్​ను లారీ డీ కొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా కంచరపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగింది.

విశాఖ జిల్లా కంచరపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఊర్వశి కూడలి వద్ద బైక్​ను లారీ డీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి.. లారీ వెనక చక్రం కింద పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి.. స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి 100రోజులు.. రాష్ట్రవ్యాప్త నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.