ETV Bharat / crime

ROAD ACCIDENT: స్కార్పియోను ఢీకొట్టిన టిప్పర్‌... ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

author img

By

Published : Oct 8, 2021, 8:32 AM IST

ఓ టిప్పర్ స్కార్పియో వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా జోలదరాసి వద్ద జరిగింది.

2-men-died-in-road-accident-at-kurnool-district
స్కార్పియోను ఢీకొట్టిన టిప్పర్‌... ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాసి గ్రామం వద్ద ఓ టిప్పర్... స్కార్పియో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోవెలకుంట్లకు చెందిన వీరంతా జోలదరాసిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. ఏడుగురికి తీవ్రగాయాలు కాగా... విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను కోవెలకుంట్ల ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కష్టాలు చెబుతామంటే పట్టించుకోవట్లేదు.. సహనాన్ని పరీక్షించొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.