ETV Bharat / city

సాగరతీరానికి కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం.. ఆత్మహత్యేనా?

author img

By

Published : Jun 30, 2021, 7:56 PM IST

women-dead-body-found-at-beach-in-vishaka
women-dead-body-found-at-beach-in-vishaka

విశాఖ(vishaka) సాగర తీరానికి ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. వై.ఎమ్.సి.ఏ వద్ద బీచ్(beach)​లో మహిళ మృతదేహాన్ని అటుగా వెళ్లేవారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

విశాఖ సాగరతీరానికి ఓ మహిళ మృతదేహం(dead body) కొట్టుకొచ్చింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఆమె వివరాలు సేకరించారు. లాసెన్స్ బే కాలనీ పెదవాల్తేర్ వద్ద ఎస్.ఎస్.ఎన్ ఎన్​క్లేవ్​లో ఉండే కల్యాణి(49)గా గుర్తించారు. కొన్ని రోజులుగా ఇంట్లో సమస్యలతో ఆమె మనస్థాపం చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: WATER DISPUTES: తెలంగాణపై ఏపీ మంత్రిమండలి సీరియస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.