ETV Bharat / city

vijayasai reddy: 'నా పేరున ఇప్పటివరకు విశాఖలో స్థలాలు, భూములు లేవు

author img

By

Published : Sep 2, 2021, 12:29 PM IST

తన పేరున విశాఖలో స్థలాలు, భూములు లేవని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. డబ్బు, భూముల కొనుగోలుపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

vijayasai reddy
vijayasai reddy

డబ్బు, భూముల కొనుగోలు, భూ ఆక్రమణలపై తనకు ఆసక్తి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని ప్రతిపక్షాలు ఆరోపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను సీఎం చూసుకోమన్నందునే దృష్టిపెట్టానని స్పష్టం చేశారు. విశాఖ వైకాపా కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.

'నా పేరున ఇప్పటివరకు విశాఖలో స్థలాలు, భూములు లేవు. భవిష్యత్తులో విశాఖలో స్థిరపడాలనుకుంటున్నా. నా పేరు చెప్పి భూ ఆక్రమణలకు పాల్పడితే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి. త్వరలో 2 టోల్‌ఫ్రీ నెంబర్లు ఇస్తా... ఫోన్‌ చేస్తే వారి ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటాం. అధికారంలో ఉన్నాం.. ఎవరు ప్రశ్నించరనుకుంటే ప్రజలు హర్షించరు. ప్రజాభీష్టం ప్రకారం పాలన చేయాలని మేయర్, కార్పొరేటర్‌కు చెబుతున్నా.' - విజయసాయి రెడ్డి

ఇదీ చదవండి:

దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్‌

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.