ETV Bharat / city

తూర్పు నౌకాదళ ప్రధానాధికారితో పోర్టు ఛైర్మన్ భేటీ

author img

By

Published : Apr 10, 2021, 10:18 AM IST

తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్రబహుదూర్ సింగ్​తో విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ కె.రామ్మోహనరావు భేటీ అయ్యారు. పోర్టు రక్షణ, అభివృద్ధిపై చర్చించారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా విశాఖ ఎదిగేందుకు సవాళ్లను ఎదుర్కోవడానికి సమకూరిన మౌలిక సదుపాయాలపై చర్చ సాగింది.

తూర్పునౌకాదళ ప్రధానాధికారితో పోర్టు ఛైర్మన్ భేటీ
తూర్పునౌకాదళ ప్రధానాధికారితో పోర్టు ఛైర్మన్ భేటీ

తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్రబహుదూర్ సింగ్​తో విశాఖ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ కె.రామ్మోహనరావు భేటీ అయ్యారు. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో వీరివురు పలు అంశాలపై చర్చించారు. విశాఖ సహజ నౌకాశ్రయం తొలి నాళ్లలో ఎదిగిన తీరు, దానికి నావికాదళం సహకరించిన అంశాలను గుర్తు చేసుకున్నారు.

విశాఖ పోర్టుకు రక్షణ పరంగా, అభివృద్ధి పరంగా తూర్పు నౌకాదళం ఎంతో అండగా ఉంటోందని పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు వ్యాఖ్యానించారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా విశాఖ ఎదిగేందుకు సవాళ్లను ఎదుర్కోవడానికి సమకూరిన మౌలిక సదుపాయాలపై చర్చ సాగింది.

ఇదీ చదవండి:

కాకినాడ సంయుక్త కలెక్టర్​పై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.