ETV Bharat / city

married woman dead: పెళ్లై రెండు నెలలైనా కాలేదు.. వివాహిత అనుమానాస్పద మృతి

author img

By

Published : Dec 17, 2021, 4:22 PM IST

Married woman Dead: విశాఖపట్నంలోని భీమిలి 4వ వార్డులో ఓ మహిళ అనుమానాస్పద మృతిచెందింది. భర్తే ఆమెను హతమార్చాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

dead
dead

married woman dead: పెళ్లై రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. దంపతులిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. ఆ నవ వధువు మాత్రం మృత్యుఒడికి చేరింది. ఈ విషాదకర సంఘటన విశాఖపట్నంలో జరిగింది.

విశాఖపట్నంలోని భీమిలి 4వ వార్డులోని గోవుపేటలో నర్సాయమ్మ (24) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే.. రాత్రివేళ భర్త హరి భార్యను చంపాడంటూ మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Honey Trap: 'వలపు వలతో దోచుకుంటున్నారు.. బాధితులు భయంతో ఆగిపోతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.