ETV Bharat / city

తాను పడుకునే మంచానికే నిప్పు పెట్టాడు.. ఆస్పత్రిలో వ్యక్తి బీభత్సం!

author img

By

Published : Mar 16, 2022, 12:21 PM IST

Updated : Mar 16, 2022, 1:01 PM IST

Fire in hospital: వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తాను పడుకునే మంచానికే నిప్పు పెట్టాడు. మంటలు వ్యాపించడంతో మిగతా రోగులు భయాందోళనకు గురయ్యారు.

Fire in hospital
ఆస్పత్రిలో మతిస్తిమితంలేని వ్యక్తి బీభత్సం

Fire in hospital: చికిత్స కోసం విశాఖ జిల్లా పాడేరు ఆసుపత్రిలో చేరిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. తాను చికిత్స తీసుకుంటున్నమంచానికే నిప్పంటించాడు. భయాందోళనలకు గురైన తోటి రోగులు బయటికి పరుగులు తీశారు.

ఆస్పత్రిలో మతిస్తిమితంలేని వ్యక్తి బీభత్సం

మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. ఎవ్వరికీ అపాయం కలగకపోవడంతో.. తోటి రోగులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సదరు వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గదిలో బంధించారు.

ఇదీ చదవండి: గాజువాక హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదల... ఆందోళనలో స్థానికులు

Last Updated :Mar 16, 2022, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.