Vijayasai Reddy: ఎన్నికల్లో వైకాపాదే ఘన విజయం: ఎంపీ విజయసాయిరెడ్డి

author img

By

Published : Nov 13, 2021, 3:23 PM IST

Visakhapatnam Municipal Corporation election

కుప్పంతో పాటు పలుచోట్ల జరుగుతున్న ఎన్నికల్లో వైకాపాదే విజయమన్నారు(mp Vijayasai Reddy news) ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న రెండు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న ఎన్నికల ఫలితాల తరువాత.. తెదేపా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో వైకాపాదే విజయం అని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy news) ధీమా వ్యక్తం చేశారు. జీవీఎంసీ(Greater Visakhapatnam Municipal Corporation news) ఉప ఎన్నికల్లో భాగంగా అల్లిపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల తరువాత తెదేపా తుడిచిపెట్టుకునిపోతుందని వ్యాఖ్యానించారు. లోకేశ్ మాట్లాడుతున్న భాష సరిగాలేదన్నారు. జీవీఎంసీ పరిధిలోని రెండు వార్డుల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల ఫలితాలు.. 2024 నాటి వైకాపా విజయానికి నిదర్శనంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

  • జీవీఎంసీ 31వ వార్డు పరిధిలోని అల్లిపురంలో ఈరోజు వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రీ బిపిన్ కుమార్ జైన్ కు మద్దతుగా చేపట్టిన ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ప్రతి ఇంటికీ వెళ్లి సీఎం జగన్ గారు ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించడం జరిగింది. pic.twitter.com/dibWn5H7sJ

    — Vijayasai Reddy V (@VSReddy_MP) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

'​టీకా వేసుకోకపోతే బస్సుల్లోకి నో ఎంట్రీ'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.