ETV Bharat / city

Baby Abducted: విశాఖ కేజీహెచ్​లో కలకలం.. నర్సులా వచ్చి..

author img

By

Published : Mar 17, 2022, 11:14 AM IST

baby was abducted
విశాఖ కేజీహెచ్​లో పసికందు అపహరణ

baby abducted: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి కన్నీళ్లు మిగిలాయి.. పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకున్న ఆ అమ్మ కళ్లకు బిడ్డ కనిపించకుండాపోయింది... నర్సు, ఆయా రూపంలో వచ్చి ఆ తల్లికి బిడ్డును దూరం చేశారు ఇద్దరు మహిళలు... పసికందును ఎత్తుకుపోయి ఆ మాతృమూర్తికి గర్భశోకాన్ని మిగిల్చారు.. అసంలేం జరిగిందంటే...

విశాఖ కేజీహెచ్​లో పసికందు అపహరణ

baby abducted: విశాఖ కేజీహెచ్‌లో బుధవారం రాత్రి నాలుగు రోజుల పసికందు అపహరణకు గురవడం కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు నగరంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు పిల్లలతో వెళ్తున్న వారిని ఆరా తీశారు. ఆటోలు, బస్సులను తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్య, నర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు.

అసలేం జరిగింది..

పద్మనాభం మండలం రౌతుపాలేనికి చెందిన అప్పాయమ్మ ఈనెల 13న కేజీహెచ్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బుధవారం రాత్రి 7.25 గంటల సమయంలో ప్రసూతి వార్డుకు ఇద్దరు మహిళలు ఒకరు నర్సులా, మరొకరు ఆయాలా వచ్చి పాపను పరీక్షించాలని చెప్పి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పయమ్మకు అనుమానం వచ్చి తన బంధువులను పంపిస్తామని చెప్పగా, వారి అవసరం లేదని చెప్పి పాపను బలవంతంగా తీసుకువెళ్లారు. సమయం దాటుతున్నా బిడ్డను తీసుకురాకపోవడంతో తల్లి కంగారుపడింది. పాపను తీసుకెళ్లిపోయారని గుర్తించి కేకలు వేసింది. ఆసుపత్రి సిబ్బంది అక్కడికి చేరుకొని పసికందు అపహరణకు గురైనట్లు గుర్తించి స్థానిక ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీను పరిశీలించగా ఒక మహిళ హడావుడిగా బిడ్డను తీసుకువెళ్తున్నట్లు అందులో రికార్డు అయింది. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో ఇద్దరికి మించి పాల్గొని ఉండొచ్చని అనుమానిస్తుస్తున్నారు. క్యాజువల్టీ నుంచి బయటకొచ్చిన వారు కేజీహెచ్‌ గేటు వద్ద ఆటో ఎక్కినట్లు భావిస్తున్నారు.

ఉన్నతాధికారుల విచారణ..

అపహరణ సమాచారం తెలుసుకున్న వెంటనే కేజీహెచ్‌ పర్యవేక్షణ వైద్యాధికారిణి డాక్టర్‌ మైథిలి, ఏసీపీ శిరీష ప్రసూతి వార్డుకి వెళ్లి ఘటన గురించి విచారించారు. బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళలు ఎప్పుడొచ్చారు, మొదట ఎవరు చూశారు, వారు ఎలా ఉన్నారు వంటి వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తున్నారు వంటివి ఆరా తీస్తున్నారు. ప్రసూతి వార్డులోకి ఎవరినీ రానీయకుండా గేట్లు మూసేశారు. బిడ్డ అపహరణ నేపథ్యంలో అక్కడున్న మిగిలిన తల్లులు భయాందోళన చెందుతున్నారు. అపహరణ సమయంలో కుటుంబ సభ్యులు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఆసుపత్రిలో కొన్ని సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ప్రైవేటు స్థలాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Police Drinking at PS: అక్కడ తాగితే ఎవరూ పట్టించుకోరనుకున్నారు.. కానీ వీడియో వైరలయ్యింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.