ETV Bharat / city

YCP ON TDP: 'చంద్రబాబు.. జగన్​ను దూషించేలా ప్రోత్సహిస్తున్నారు'

author img

By

Published : Sep 17, 2021, 8:29 PM IST

చంద్రబాబు.. తెదేపా నాయకులను రెచ్చగొట్టి ముఖ్యమంత్రి జగన్​ను దూపించేలా ప్రోత్సహిస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. రౌడీలను అడ్డుపెట్టుకుని జోగి రమేశ్​పై దాడికి తెగబడ్డారని ఆరోపించారు.

'చంద్రబాబు.. జగన్​ను దూషించేలా ప్రొత్సహిస్తున్నారు'
'చంద్రబాబు.. జగన్​ను దూషించేలా ప్రొత్సహిస్తున్నారు'

తెదేపా నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబే రెచ్చగొట్టి ముఖ్యమంత్రి జగన్​ను దూషించేలా ప్రోత్సహిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్​పై తెదేపా నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బుద్దా వెంకన్న నాటకాలు అందరికీ తెలుసని విమర్శించారు. చంద్రబాబు తక్షణమే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలన్నారు. వివాదాలతో నాయకుడు కావాలని లోకేశ్ ప్రయత్నిస్తున్నారని.. భవిష్యత్తులో ఇలాగే వ్యవహరిస్తే తెదేపాకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Condemn: ఆంధ్రాలో ఉన్నామా? అఫ్గాన్‌లో ఉన్నామా?: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.