విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు సచివాలయం సిబ్బందిని (Secretariat Employees Suspended at vijayawada) విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ విధుల నుంచి తొలగించారు. విజయవాడ 38వ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ ఇన్ఛార్జ్ పరిపాలన కార్యదర్శి రాజీవ్ కుమార్, వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి రాణి, వార్డు ప్రణాళిక, క్రమబద్దీకరణ కార్యదర్శి నాగలక్ష్మిలను సస్పెండ్ చేశారు.
38వ వార్డు సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న సారిక.. డ్యూటీకి గైర్హాజరైనప్పటికీ ప్రతినెలా పూర్తి గౌరవ వేతనం చెల్లించారనే ఆరోపణల నేపథ్యంలో.. వీరిపై అదనపు కమిషనర్ అరుణ ప్రాథమిక విచారణ జరిపారు. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబరు వరకు వాలంటీర్కు గౌరవ వేతనంగా దాదాపు రూ.25 వేలు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని విచారణలో తేలింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి
Flood Victim: వరద మిగిల్చిన వేదన.. భర్త ఆచూకీ కోసం భార్య తపన