ETV Bharat / city

మూతపడ్డ ఎన్టీఆర్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ... స్పేర్ పార్ట్స్ మార్కెట్ కుదేలు

author img

By

Published : May 28, 2020, 2:08 PM IST

మూతపడ్డ ఎన్టీఆర్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ... స్పేర్ పార్ట్స్ మార్కెట్ కుదేలు
మూతపడ్డ ఎన్టీఆర్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ... స్పేర్ పార్ట్స్ మార్కెట్ కుదేలు

కరోనా ధాటికి దిల్లీ నుంచి గల్లీ వరకూ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కుదేలయ్యాడు. చిన్న ఎలక్ట్రానిక్స్ షాపు నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకూ ఏ ఒక్కరినీ కరోనా ప్రభావం విడిచిపెట్టలేదు. ఎలక్ట్రానిక్ రంగంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. నేటి ప్రపంచం ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు లేకుండా అడుగు ముందుకు వెయ్యలేని పరిస్థితి. ఎలక్ట్రానిక్స్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మందికి కరోనా కన్నీళ్లు మిగిల్చింది.

సెల్​ ఫోను లేకుండా రోజు గడవని పరిస్థితి. అటువంటి సెల్​ఫోను రిపేర్​ అయితే.. అసలే లాక్​డౌన్, పైగా కరోనా భయం. ఇలాంటి సమయంలో రిపేర్ షాపులు లేక వినియోగదారులకు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది.

రాష్ట్రమంతటికీ ముడిసరకు సరఫరా అయ్యే విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ మూతపడటం ఓ కారణం. కరోనా ఎలక్ట్రానిక్స్ వస్తువులు, స్పేర్ పార్ట్స్ మార్కెట్​ను కుదేలు చేసింది. లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చినా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరకు రవాణా జరిగే విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ బఫర్ జోన్ పరిధిలో ఉండటం వల్ల దుకాణాలు తెరుచుకోని పరిస్థితి నెలకొంది.

ఫలితంగా ఇతర జిల్లాలపైనా ఈ ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్​ పరికరాలు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. వ్యాపారం లేక భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని దుకాణ యజమానులు వాపోతున్నారు. ఆన్​లైన్​ మార్కెట్ దెబ్బతో తీవ్రంగా నష్టపోతున్నా తమను కరోనా మరింత దెబ్బతీసిందని అంటున్నారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై అమరావతి డిజిటల్ ఎలక్ట్రానిక్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఈటీవీ భారత్ మాట్లాడింది.

ఇదీ చదవండి:

రంగుల అంశంపై హైకోర్టుకు సీఎస్​, పంచాయతీ ముఖ్య కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.