ETV Bharat / city

DC Transfers: రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

author img

By

Published : Aug 20, 2021, 8:18 PM IST

Updated : Aug 20, 2021, 9:14 PM IST

రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

20:16 August 20

రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం దేవస్థాన ఈవోగా లవన్నను నియమిస్తూ..ప్రస్తుత ఈవో కేఎస్. రామారావును సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవోగా ఏ.మురళి, అమలాపురం ఆర్డీవో వసంత రాయుడు, గుంటూరు జిల్లా గురజాల ఆర్డీవో పార్థసారధిలను బదిలీ చేశారు.  

ఏపీఎస్సీసీఎఫ్‌సీ (APSCCFC) కృష్ణా జిల్లా ఈడీగా చంద్రలీలను నియమించారు.  పులిచింతల ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ పీఏగా వసంత బాబును బదిలీ చేశారు. కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్​గా రంగ స్వామిని నియమించారు. విశాఖ జాయింట్ కలెక్టర్ (ఆసరా) గోవిందరావును నర్సిపట్నం ఆర్డీవోగా ప్రభుత్వం బదిలీ చేసింది. రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఓఏస్డీగా నర్సింహులును బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా హెచ్‌వీ జయరాంను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. 

ఇదీ చదవండి

CM KCR: 'కేఆర్‌ఎంబీ సమావేశంలో బలమైన వాణి వినిపించండి'

Last Updated : Aug 20, 2021, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.