ETV Bharat / city

'దేవాలయాల్లో కంటే మంత్రి ఇంట్లో హుండీకే ఆదాయం ఎక్కువ'

author img

By

Published : Feb 18, 2021, 4:50 PM IST

దేవాలయాల్లో కంటే మంత్రి ఇంట్లో హుండీకే ఆదాయం ఎక్కు
దేవాలయాల్లో కంటే మంత్రి ఇంట్లో హుండీకే ఆదాయం ఎక్కు

విజయవాడ దుర్గ గుడిలో కోటిన్నర విలువ చేసే స్క్రాప్​ను మంత్రి వెల్లంపల్లి రూ.15 లక్షలకే అమ్మేశారని తెదేపా నేత జలీల్ ఖాన్ ఆరోపించారు. దేవాలయాల్లో హుండీల కంటే మంత్రి ఇంట్లో హుండీనే ఎక్కువగా నిండుతోందని ఎద్దేవా చేశారు.

దేవాలయాల్లో హుండీల కంటే మంత్రి వెల్లంపల్లి ఇంట్లో హుండీనే ఎక్కువ నిండుతోందని తెదేపా నేత జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. విజయవాడ దుర్గ గుడిలో కోటిన్నర విలువ చేసే స్క్రాప్​ను మంత్రి రూ.15 లక్షలకే అమ్మేశారని ఆరోపించారు.

అధికారుల బదిలీల్లో వెల్లంపల్లి భారీగా దోచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుని విమర్శించే స్థాయి వెల్లంపల్లికి లేదన్న ఆయన... పోలీసులు లేకపోతే ప్రజలే వైకాపా నేతల భరతం పట్టేవారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

చింతమనేని అరెస్టు అప్రజాస్వామికం: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.