ETV Bharat / city

chandrababu: ఈశ్వర్‌ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు: చంద్రబాబు

author img

By

Published : Sep 21, 2021, 12:03 PM IST

Chandrababu and MLA Balakrishna
తెదేపా అధినేత చంద్రబాబు , ఎమ్మెల్యే బాలకృష్ణ

తెలుగు సినీ ప్రముఖులు ఈశ్వర్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu) , ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) సంతాపం తెలిపారు. ఈశ్వర్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

తెలుగు సినీ ప్రముఖులు ఈశ్వర్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) విచారం వ్యక్తం చేశారు. 2550 పైగా సినిమాల‌కు ప‌బ్లిసిటీ డిజైన్స్ రూపొందించిన ఈశ్వర్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ.. ఈశ్వర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • తెలుగు సినీ ప్రముఖులు, 2550 పైగా సినిమాల‌కు ప‌బ్లిసిటీ డిజైన్స్ రూపొందించిన ఈశ్వర్ గారి మరణం విచారకరం. సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈశ్వర్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/BPMZd1jov4

    — N Chandrababu Naidu (@ncbn) September 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలుగు సినీ ప్రముఖులు ఈశ్వర్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ(Balakrishna) సంతాపం తెలిపారు. తాను నటించిన చిత్రాలకు ఈశ్వర్ పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఈశ్వర్​తో మంచి సంబంధం ఉందన్న బాలకృష్ణ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్​ ఈశ్వర్​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.