ETV Bharat / city

ఉపరాష్ట్రపతిని కలిసిన పలువురు రాష్ట్ర నేతలు

author img

By

Published : Dec 28, 2020, 10:54 PM IST

విజయవాడ స్వర్ణభారతి ట్రస్టుకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు కలిశారు. వెంకయ్యను కలిసిన వారిలో మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరితో పాటు తెదేపా మహిళా నేత కేశినేని శ్వేత తదితరులు ఉన్నారు.

ఉపరాష్ట్రపతిని కలిసిన పలువురు రాష్ట్ర నేతలు
ఉపరాష్ట్రపతిని కలిసిన పలువురు రాష్ట్ర నేతలు

విజయవాడ స్వర్ణభారతి ట్రస్టుకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు కలిశారు. మంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి.. వెంకయ్యతో సమావేశమై..గుడివాడ రైల్వే పైవంతెన గురించి చర్చించారు. పైవంతెన విషయమై రైల్వేశాఖకు సూచనలు చేయాలని ఉపరాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన వెంకయ్య.. గుడివాడ రైల్వే వంతెన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత.. ఉపరాష్ట్రపతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. యువతే దేశానికి వెన్నుముకని, దేశ అభివృద్ధి యువత చేతిలో ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు. శ్వేత రాజకీయల్లోకి వచ్చి యువతను ప్రభావితం చేయటం ఆనందదాయకమన్నారు. కరోనాను జయించిన వెంకయ్య ఆత్మ విశ్వాసం అందరికి ఆదర్శనీయమని శ్వేత అన్నారు.

ఇదీచదవండి

సమస్యలను సోపానాలుగా మార్చుకోవాలి: ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.