ETV Bharat / city

ఇంజినీరింగ్, వృత్తివిద్య విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

author img

By

Published : Apr 23, 2021, 8:14 PM IST

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజినీరింగ్, వృత్తివిద్య విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ద్వారా 42 రకాల కోర్సుల్లో శిక్షణ అందించనుంది.

Skill training for engineering and vocational students in ap
ఇంజినీరింగ్, వృత్తివిద్య విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

ఇంజినీరింగ్, వృత్తివిద్య కళాశాల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వర్చువల్ విధానంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. కాగా..1.6 లక్షల మందికి 42 రకాల కోర్సులను మైక్రోసాఫ్ట్ అందించనుంది. యాప్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌, డేటా ఎనలటిక్స్, డేటా బేస్ లాంటి కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రం, కోర్సు చేసే విద్యార్థికి 100 డాలర్ల నగదు బహుమతిని మైక్రోసాఫ్ట్ ఇవ్వనుంది.

ఇదీచదవండి

18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌: జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.