ETV Bharat / city

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్ లారీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Dec 7, 2020, 9:17 AM IST

Updated : Dec 7, 2020, 10:26 AM IST

road-accident
road-accident

09:13 December 07

విజయవాడలో రోడ్డు ప్రమాదం..

విజయవాడ కృష్ణలంక బస్టాండ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణలంక రణధీర్ నగర్​కు చెందిన వారిగా గుర్తించారు. టిప్పర్ లారీ ఢీ కొట్టిన వెంటనే ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అగ్నికి ఆహుతై మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో మరణించారు. మృతులు వినోద్, శేఖర్​లు గుర్తించారు. కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: 

కృష్ణాజిల్లా బొమ్ములూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

Last Updated :Dec 7, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.