ETV Bharat / city

Suspicious Death: చర్చిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

author img

By

Published : Jun 19, 2022, 5:25 PM IST

విజయవాడ బాసలికా చర్చిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం కలకలం రేపుతోంది. మృతదేహంపై గాయాలు ఉండటం, చర్చిలో రక్తపు మరకలు కనిపించటం పలు అనుమానాలకు తావిస్తోంది.

చర్చిలో వ్యక్తి అనుమానస్పద మృతి
చర్చిలో వ్యక్తి అనుమానస్పద మృతి

విజయవాడ బాసలికా చర్చిలో ప్రసాదరావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం కలకలం రేపుతోంది. ఈ ఉదయం చర్చిలో పనిచేసే సిబ్బంది ఆయన ఉరేసుకొని ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రసాదరావు సీఎస్​ఐలో అటెండర్‌గా పనిచేసే వాడని తెలిసింది. నిన్న రాత్రి నందిగామ వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తెల్లారేసరికి శవమై కనిపించటంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటం, చర్చిలో రక్తపు మరకలు కనిపించటం పలు అనుమానాలకు తావిస్తోంది.

అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చర్చిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రసాదరావు చాలా క్రితమే సీఎస్​ఐలో ఉద్యోగం మానేశాడని.., సీఎస్​ఐ నుంచి రూ.40 లక్షలు రావాల్సి ఉందని.. దీనిపై ఆయన గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశారని తెలిసింది.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.