ETV Bharat / city

చివరిచూపు కోసం ఆరాటం.. చరవాణిలో ఫొటోలు

author img

By

Published : Apr 25, 2021, 7:47 AM IST

రెండవ దశలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. పాజిటివ్​ కేసులతో పాటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. చివరి చూపు కోసం బంధువులు పడే ఆరాటం కలచివేస్తోంది.

vijayawada covid hospital
చివరిచూపు కోసం బంధువుల ఆరాటం

కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొవిడ్​ రోగులు చాలామంది ఆక్సిజన్​ అందక మృత్యువాత పడుతున్నారు. మృతదేహాలతో శవాగారాలు నిండిపోతున్నాయి. విజయవాడలోని కొవిడ్​ ఆస్పత్రిలో మార్చురీ వద్ద రోజూ ఉదయాన్నే తమ వారి మృతదేహాల కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు. సీరియల్‌ నంబరు ఇవ్వడానికి, పంచనామా జరగడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఆఖరిచూపు కోసం మృతదేహాల మీద కప్పిన కవరు పైనుంచే చరవాణిలో ఫొటోలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ ఉద్ధృతి వేళ రాష్ట్రంలో ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.