ETV Bharat / city

నగరాల ఆదాయం పల్లెలకు రావాలి: పవన్

author img

By

Published : Sep 7, 2020, 9:32 PM IST

గ్రామాల డబ్బు గ్రామాల్లోనే ఉండాలి.. నగరాల ఆదాయం పల్లెలకు రావాలి అదే ప్రకృతి వ్యవసాయ ఫలితమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాలని... ఈ తరహా సాగు విధానంతో చిన్నపాటి భూమిలో ఒక కుటుంబంలోని నలుగురూ కలిసి పని చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుందనే విషయాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

నగరాల ఆదాయం పల్లెలకు రావాలి: పవన్
నగరాల ఆదాయం పల్లెలకు రావాలి: పవన్

నగరాల ఆదాయం పల్లెలకు రావాలి..

ప్రకృతి వ్యవసాయం విధానం అవసరం, విశిష్టత గురించి తెలిపే అనుభవం... ప్రకృతి వ్యవసాయ రైతు విజయరామ్‌కి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంపై విజయరామ్‌ అనుభవాలను పవన్‌ తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే ముందు తాను ముందు ఆచరించాలని... అందుకే కృష్ణా జిల్లాలో ఆరు ఎకరాలు భూమి కొనుగోలు చేసి అక్కడ చెరువు తవ్వానని...అనంతరం పాలేకర్ విధానాలను అనుసరించానని వివరించారు.

ప్రకృతి వ్యవసాయంలో దేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని విజయ్​రామ్​ అన్నారు. కారణం అక్కడ గోవుని పూజించే స్వాములు, పీఠాధిపతులు, వారి ఆశ్రమాలన్నీ అక్కడ ఎక్కువ ఉన్నాయని... తమ భక్తులకు ప్రకృతి వ్యవసాయం గురించి వారు వివరిస్తున్నారన్నారు. అలాంటి బాధ్యత ఇక్కడ స్వాములంతా తీసుకోవాలని విజయరామ్‌ కోరారు. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రం ప్రకృతి వ్యవసాయంలో ముందుంటుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అందరికీ విషతుల్యం కాని ఆహారం ఇవ్వాలని... అందరికీ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలగాలని విజయరామ్‌ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: అంతర్వేది రథం దగ్ధం ఘటన: ఆలయ ఈవో బదిలీ: వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.