ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు తక్షణ వేతన చెల్లింపుల కోసం 1853.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఎస్సీలకు 452.36 కోట్లు, ఎస్టీలకు 160.59 కోట్లు, ఇతరులకు 1240.86 కోట్లు విడుదలైనట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విడుదలైన మొత్తం కూలీల ఖాతాలలో నేరుగా జమ అవుతాయని మంత్రి వెల్లడించారు.
13 జిల్లాల్లోని అన్ని మండలాల్లో అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పనుల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనంగా 6 కోట్ల పని దినాలను ఆమోదించాల్సిందిగా కోరుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు పెద్దిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి