ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 809 కరోనా కేసులు.. 10 మరణాలు

author img

By

Published : Oct 1, 2021, 5:36 PM IST

Updated : Oct 1, 2021, 6:06 PM IST

ap corona cases
ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు

17:34 October 01

VJA_Corona bulletin_Breaking

ap corona cases
ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు

  రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,463 పరీక్షలు నిర్వహించగా.. 809 కేసులు నిర్ధారణ(ap corona cases) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,51,133 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 10 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,186కి చేరింది. తాజాగా 1,160 మంది బాధితులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,25,805కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో11,142 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,83,50,167నమూనాలను ఆరోగ్య శాఖ(covid cases in ap) పరీక్షించింది.

  కరోనాతో గుంటూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందగా.. శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చనిపోయారు.

ఇదీ చదవండి..

Corona cases in India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Last Updated : Oct 1, 2021, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.