ETV Bharat / city

SC Commission: గవర్నర్, సీఎంలతో ఎస్సీ కమిషన్ మర్యాదపూర్వక భేటీ

author img

By

Published : Aug 24, 2021, 7:44 PM IST

గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​, సీఎం జగన్​తో ఎస్సీ కమిషన్ సభ్యుల బృందం వేర్వేరుగా భేటీ అయింది. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఎస్సీ కమిషన్ బృందం వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్, సీఎంలతో ఎస్సీ కమిషన్ మర్యాదపూర్వక భేటీ
గవర్నర్, సీఎంలతో ఎస్సీ కమిషన్ మర్యాదపూర్వక భేటీ

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​ను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్​ను కలిసిన వారిలో కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్, కమిషన్ సభ్యులు డాక్డర్ అంజూబాల, సుభాష్ రామ్​నాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ బృందాన్ని మఖ్యమంత్రి జగన్ సన్మనానించారు.

అనంతరం రాజ్​భవన్​కు చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కమిషన్ బృందానికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. సమకాలీన అంశాలపై గవర్నర్​తో కమిషన్ సభ్యులు చర్చించారు. ఈ భేటీలో గిరిజన, సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

sc commission at guntur : రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్‌

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.