ETV Bharat / city

తెదేపా మద్దతుదారులు ఒక్కొక్కరూ.. ఒక్కో బాహుబలి: లోకేశ్

author img

By

Published : Feb 18, 2021, 5:41 PM IST

మూడో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైకాపా అరాచ‌కాలు, అక్ర‌మాలు, అన్యాయాల‌కు తెదేపా మద్దతుదారులు ఎదురొడ్డారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గెలిచారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రేణుల్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

nara lokesh on third phase elections
nara lokesh on third phase elections

"ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా జ‌ర‌గాల్సిన‌ ఎన్నిక‌ల ప్ర‌కియ‌ను వైకాపా కాల‌కేయులు దాడుల‌తో యుద్ధంగా మార్చారు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. "ఈ అరాచ‌క పోరాటంలో గెలిచిన తెదేపా మ‌ద్ద‌తుదారులు ఒక్కొక్క‌రూ ఒక్కో బాహుబ‌లి" అని అభివర్ణించారు.

"జ‌గ‌న్‌రెడ్డి అధికారం అండ‌తో, అధికారులు ప్రేక్ష‌కులై చూస్తుంటే, వీరుల్లా పోరాడారు. వైకాపా బ‌ల‌వంతపు ఏక‌గ్రీవాల కంటే తెదేపా మద్దతుదారులు సాధించిన విజ‌యాలు త‌క్కువ‌గా ఉన్నా.. అస‌లు సిస‌లైన గెలుపు మాదే" అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

రామోజీ ఫిల్మ్​ సిటీలో పర్యటకుల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.