ETV Bharat / city

మెగా అభిమానులకు టైమొచ్చింది : నాదెండ్ల

author img

By

Published : Jun 5, 2022, 6:12 PM IST

పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మెగా అభిమానులు కృషి చేయాలని.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో చిరంజీవి యువత ప్రతినిధులతో మనోహర్ సమావేశమయ్యారు. వంద శాతం జనసేన జెండా మోసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు.

నాదెండ్ల మనోహర్‌
నాదెండ్ల మనోహర్‌

అంధకారంలోకి వెళ్లిపోతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగమై మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి చేయడానికి మెగా అభిమానులు కృషి చేయాలని కోరారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో చిరంజీవి యువత ప్రతినిధులతో మనోహర్ సమావేశమయ్యారు. వంద శాతం జనసేన జెండా మోసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. గ్రామస్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలని సూచించారు.

పార్టీ ప్రయాణంలో అభిమానులకు స్థానం కల్పించే ఏర్పాటు చేస్తామని నాదెండ్ల చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు త్వరలో కిట్లు పంపిణీ చేస్తామని, అలాగే వచ్చే నెల నుంచి శిక్షణా తరగతులు ఉంటాయని.. అందులో అభిమాన సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. క్షేత్రస్థాయిలో అభిమాన సంఘాలను పార్టీలో కలిపే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేద్దామన్నారు. జనసేన విజయంలో తమవంతు పాత్ర పోషించేందుకు చిరంజీవి యువత ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తంచేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.