ETV Bharat / city

రాష్ట్రంలో కరెంటు కోతలు అందుకే : రఘురామ

author img

By

Published : Apr 8, 2022, 6:57 PM IST

mp rrr
ఎంపీ రఘురామకృష్ణరాజు

MP RRR on CM Jagan: ముఖ్యమంత్రి జగన్​పై ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా ఆర్థిక అరాచకాలు, అప్పుల తప్పులే జగన్‌ను దిల్లీకి రప్పించాయని పేర్కొన్నారు. కరెంట్​ ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని..​ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో విద్యుత్​ ఛార్జీల పెంపుపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. 'విద్యుత్‌ ఛార్జీలు పెంచడం వల్ల బిల్లులు ఎక్కువస్తాయి. బిల్లులు తగ్గించాలంటే ఏం చేయాలి.. అందుకే విద్యుత్‌ కోతలు మొదలుపెట్టారు' అని ముఖ్యమంత్రి జగన్​పై రఘురామ మండిపడ్డారు. కరెంట్​ బిల్లులను అమాంతం పెంచి ప్రజలపై భారం వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని రఘురామ డిమాండ్‌ చేశారు. జగన్​ దిల్లీ పర్యటనపై కామెంట్స్ చేసిన రఘురామ.. జగన్‌ను ఎందుకు పిలిచారో తనకు తెలుసునన్నారు. జగన్‌ సమయం అడిగితే ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. వైకాపా చేసిన ఆర్థిక అరాచకాలు, అప్పుల తప్పుల నేపథ్యంలో జగన్‌ను దిల్లీకి పిలిచారని అన్నారు.

ఇదీ చదవండి:

Lokesh: "సీఎం జాలీ రెడ్డి.. అభివృద్ధికి శాశ్వతంగా హాలిడే ప్రకటించారు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.