ETV Bharat / city

MLC Ashok babu: 'సీఎస్ ఆదేశాలు ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నాయి'

author img

By

Published : Aug 14, 2021, 5:17 PM IST

ప్రభుత్వ శాఖాధిపతులు విధిగా సచివాలయానికి హాజరుకావాలన్న సీఎస్ ఆదేశాలు.. వైపాకా పాలనకు అద్దం పడుతున్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు దుయ్యబట్టారు. వ్యవస్థల నిర్వహణలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా దిగజారిపోలేదన్నారు.

mlc ashok babu on cs comments
mlc ashok babu on cs comments

ప్రభుత్వ శాఖాధిపతులు.. సచివాలయానికి విధిగా హాజరుకావాలన్న సీఎస్ ఆదేశాలు.. వైపాకా పాలనకు అద్దం పడుతున్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు దుయ్యబట్టారు. ప్రజలు కలెక్టరేట్​లలో ఇచ్చే అర్జీలకు సమాధానం చెప్పేవారు లేరని ఆయన మండిపడ్డారు. వ్యవస్థల నిర్వహణలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా దిగజారిపోలేదన్నారు.

శాఖాధిపతులతో, మంత్రులతో సంబంధం లేకుండా పాలనాపరమైన అన్ని వ్యవహారాలు ముఖ్యమంత్రి, సలహాదారులే చేసేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు, ఇతర సౌకర్యాలు అందకపోయునా.. ఉద్యోగ సంఘాల నేతలు మౌనాన్నే నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

CS Meeting with IAS officers: మీరే రాకపోతే ఉద్యోగులెలా ఎలా వస్తారు: సీఎస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.