సీతానగరం రేప్ ఘటన నిందితులు సీఎం ఇంటి చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వానికి పట్టుకోవటం చేతకావట్లేదని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తన ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగి 10 రోజులవుతున్నా నిందితుల్ని పట్టుకోని ప్రభుత్వం..దిశ యాప్ డౌన్లోడ్ నెపంతో కోట్ల రూపాయల ప్రకటనలిచ్చారని ఆరోపించారు. సొంత అక్కాచెల్లెళ్లు షర్మిల, సునీతలకే భద్రత లేక ఒకరు తెలంగాణలో, ఇంకొకరు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారని లోకేశ్ విమర్శించారు.
'అక్కాచెల్లెమ్మల భద్రత-జగనన్న ప్రభుత్వ బాధ్యత' అంటూ కపట ప్రకటనలు చేస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు చంద్రబాబు చేపట్టిన దీక్షని పక్కదారి పట్టించేందుకు..ఆమోదం పొందని దిశ చట్టం కోసం, గతేడాది ప్రారంభించిన యాప్కే మరోసారి డౌన్లోడ్ కార్యక్రమం పెట్టారంటూ తప్పుబట్టారు.
ఇదీ చదవండి: 'కరోనా విపత్తును ఎదుర్కోవడంలో సీఎం విఫలమయ్యారు'