ETV Bharat / city

KRMB: ఈ నెల 27న జరగాల్సిన కేఆర్ఎంబీ భేటీ వాయిదా

author img

By

Published : Aug 24, 2021, 12:57 PM IST

Updated : Aug 24, 2021, 3:41 PM IST

KRMB
కేఆర్ఎంబీ భేటీ వాయిదా

12:54 August 24

కేఆర్ఎంబీ భేటీ వాయిదా

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న జరగాల్సిన బోర్డు భేటీని సెప్టెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. 27వ తేదీన జరగాల్సిన 14వ సమావేశం ఎజెండాను బోర్డు గతంలోనే ఖరారు చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు పంపించింది. 

ఇరు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలు, గెజిట్ నోటిఫికేషన్ పరిధి సంబంధిత అంశాలను అధికారులు ఎజెండాలో చేర్చారు. మరికొన్ని అంశాలను చేర్చాలని కోరుతూ రెండు రాష్ట్రాలు కూడా బోర్డుకు లేఖలు రాశాయి. అయితే బోర్డు 14వ సమావేశాన్ని వాయిదా వేసి సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహించనున్నట్లు కేఆర్ఎంబీ తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో బోర్డు భేటీ జరగనుంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి. సింగ్ సెలవులో ఉన్నందున భేటీ వాయిదా వేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి

Relief to Agrigold depositors: అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండో విడత నగదు జమ

Last Updated :Aug 24, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.