ETV Bharat / city

రాష్ట్రంలో తొలి విడత వ్యాక్సినేషన్.. మెుదటి టీకా ఆమెకే!

author img

By

Published : Jan 16, 2021, 11:53 AM IST

Updated : Jan 16, 2021, 5:30 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. రాష్ట్రంలో 332 కేంద్రాల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ జరిగింది. మెుదటి టీకా పారిశుద్ధ్య కార్మికురాలికి ఇచ్చారు.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మెుదటి టీకా ఆమెకే!
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మెుదటి టీకా ఆమెకే!

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం..

రాష్ట్రంలో తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 33,200 మందికి టీకా వేయనున్నారు. 15 రోజుల్లో తొలివిడత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి విడత టీకా వేయించుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో విడత టీకా వేస్తారు. విజయవాడ జీజీహెచ్‌ పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారి.. రాష్ట్రంలో మెుదటి టీకా తీసుకున్నారు.

సీఎం జగన్‌ సమక్షంలో టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు ప్రక్రియలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే పుష్పకుమారి అనే కార్మికురాలు సహా... మహిళా వైద్యురాలు, నర్సు, పారా మెడికల్ ఉద్యోగినికి ముందుగా వ్యాక్సిన్ వేశారు. కరోనా సమయంలో కష్టనష్టాలకోర్చి విధులు నిర్వర్తించిన తమకు తొలిగా టీకా వేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారి స్పందన

ఇదీ చదవండి:

భారత సత్తా ప్రపంచానికి చాటిన శాస్త్రవేత్తలు: మోదీ

Last Updated :Jan 16, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.