ETV Bharat / city

FARMERS PROTEST: 'రైతుల మరణాలకు కారణమైన వారిని శిక్షించాలి'

author img

By

Published : Oct 18, 2021, 4:39 PM IST

విజయవాడలో రైల్ రోకో
విజయవాడలో రైల్ రోకో

లఖింపూర్ ఖేరీ ఘటన(lakimpur kheri incident)ను నిరసిస్తూ.. దేశవ్యాప్త రైల్ రోకో నిరసనల్లో(rail roco protest) భాగంగా రాష్ట్రంలోని పలు చోట్లు రైతు సంఘాల నేతలు ఆందోళన చేశారు. రైతుల మరణాలకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్(demand) చేశారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా(central minister ajay mishra)ను మంత్రివర్గం(cabinet) నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ... సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో రైతు సంఘాల నాయకులు ఆందోళన చేశారు.(farmer leaders protest in vijayawada) దేశవ్యాప్తంగా చేపట్టిన రైల్ రోకో(rail roco) కార్యక్రమంలో భాగంగా విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు(vadde shobhanadrishwara rao) ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రైతులపై వాహనం నడిపి, వారి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్(demand) చేశారు. రైతు,కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నినాదాలు చేశారు.

విజయవాడలో రైల్ రోకో

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వేస్టేషన్(ongol railway station) ఎదుట ఆందోళన చేపట్టారు. లఖింపూర్ ఖేరీలో రైతుల మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా వినుకొండ(vinukonda) రైల్వే స్టేషన్ ఎదుట బైఠాయించారు.

లఖింపూర్ ఖేరీలో రైతులపై వాహనం నడిపించి, నలుగురు రైతుల మరణానికి కారకులయ్యారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి స్పందించలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. దీనిని చూస్తుంటే ఇదంతా కుట్రపూరితంగా జరిగినట్లు తెలుస్తోంది. హింసాత్మకంగా కాకుండా.. శాంతియుత పద్ధతిలో నిరసన చేస్తూ లక్ష్యాన్ని చేరుకుంటాం - వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు

లఖింపుర్ ఖేరీ ఘటన...

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీ(lakimpur kheri incident)లో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన(keshav prasad mourya) నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ(quarreling) చెలరేగింది. తమపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు(four farmers died) కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. ఆగ్రహంతో రైతులు మూడు వాహనాలను(vehicles) తగలబెట్టారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి(lotte charge) చేయటం వల్ల పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘర్షణలో మరో నలుగురు చనిపోయారు. మొత్తంగా నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీచదవండి.

ప్రకాశ్​రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు: విష్ణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.