ETV Bharat / city

'అప్పటి వరకు విద్యుత్ సమస్యను పరిష్కరిస్తాం'

author img

By

Published : Apr 10, 2022, 7:20 PM IST

రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను ఈ నెల చివరి నాటికల్లా అధిగమిస్తామని ఇందన శాఖ కార్యదర్శి తెలిపారు. అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్
ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్

రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత సమస్య తాత్కాలికమేనని.. ఈ నెల చివరికల్లా దీన్ని అధికమిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. 2014-15 నుంచి ఏడాదికి విద్యుత్ వినియోగంలో పెరుగుదల 6 శాతం ఉంటే 2021కి 14 శాతానికి పెరిగిందన్నారు. అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందన్న ఇంధన శాఖ కార్యదర్శి.. బొగ్గు సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు.

2024 వరకు 7 వేల మెగావాట్ల కోసం సెకీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఉందని శ్రీధర్ తెలిపారు. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయని అవి 2018-19 నాటికి రూ.62 వేల కోట్లకు పెరిగాయన్నారు. అనంతరం విద్యుత్ కోతలు, బకాయిలపై అడిగిన ప్రశ్నలను ఇంధన శాఖ కార్యదర్శి దాటవేశారు. వాటిపై తరువాత సమాధానం చెబుతామన్నారు.

ఇదీ చదవండి: 'అప్పటి వరకూ విద్యుత్ సమస్య ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.