ETV Bharat / city

విజయవాడలో ఎలక్ట్రికల్ ఆటో షోరూం ప్రారంభం

author img

By

Published : Feb 21, 2020, 1:35 PM IST

Electric Auto Inauguration in vijayawada
విజయవాడలో ఎలక్ట్రికల్ ఆటో షోరూం ప్రారంభం

అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే ఆటోల షోరూంను విజయవాడలో ప్రారంభించారు. ఈ ఆటోలను మెుట్టమెుదటి సారిగా పియాజియో ద్వారా మార్కెట్​లోకి తీసుకువచ్చారు.

విజయవాడలో ఎలక్ట్రికల్ ఆటో షోరూం ప్రారంభం

విజయవాడలో 'ఏప్ ఇ-సిటీ' పేరుతో అత్యాధునిక లిథియం అయాన్ స్మార్ట్ బాటరీలతో నడిచే ఆటో షోరూమ్​ను పియాజియో మేనేజర్ సాజు నాయర్ ప్రారంభించారు. పర్యావరణహితమైన ఈ ఆటోలకు ఎటువంటి పర్మిట్, రహదారి పన్నులు అవసరం లేదని రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ అన్నారు. ఈ వాహనాలు ఛార్జింగ్ కోసం సులభంగా బ్యాటరీలను మార్చుకునేలా ఛార్జింగ్ పాయింట్స్ నెలకొల్పుతున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఆటోలు దేశంలో మొట్టమొదటిసారిగా పియాజియో ద్వారా విపణిలోకి తెచ్చామన్నారు. వీటి నిర్వహణకు ఎటువంటి ఖర్చు అవసరం లేదని... మొదటి మూడు సంవత్సరాల వరకు సంస్థ ఉచిత నిర్వహణ అందిస్తుందన్నారు.

ఇవీ చదవండి...టీవీలకూ కరోనా.. మార్చి నుంచి ధరలకు రెక్కలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.