ETV Bharat / city

'సున్నా వడ్డీ పథకం ఎక్కడ అమలు చేస్తున్నారు..?'

author img

By

Published : Oct 15, 2019, 11:23 PM IST

Updated : Oct 16, 2019, 1:42 AM IST

సున్నా వడ్డీ పథకం ఎక్కడ అమలు చేస్తున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. గత నాలుగు నెలల్లో రుణాలిచ్చారో చెప్పాలని నిలదీశారు.

మాజీమంత్రి దేవినేని ఉమ

రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకం ఎక్కడ అమలవుతోందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గొప్పలు చెప్పుకున్న జగన్... ఏ బ్యాంకులో సున్నావడ్డీ కింద గత నాలుగు నెలల్లో రుణాలిచ్చారో చెప్పాలని నిలదీశారు. జగన్ మాటలు కోటలు దాటుతుంటే... చేతలు మాత్రం కార్యాలయం దాటడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ హయాంలో 14వేల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే... జగన్ 4నెలల పాలనలో ఇప్పటి వరకూ 190మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

మాజీమంత్రి దేవినేని ఉమ

ఇదీ చదవండీ... 'వైకాపా ప్రభుత్వం... వాయిదాల ప్రభుత్వం'

sample description
Last Updated : Oct 16, 2019, 1:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.