ETV Bharat / city

కరోనాపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

author img

By

Published : Mar 23, 2020, 10:58 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణపై సమీక్ష నిర్వహించిన ఆయన...ఇంట్లో ఉండాల్సిన బాధ్యతను పౌరులకు గుర్తుచేయాలన్నారు.

సీఎం జగన్‌ సమీక్ష
సీఎం జగన్‌ సమీక్ష

కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను నిత్యావసరాలకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతించాలన్నారు. అది కూడా ఒక్కరికే 3 కిలో మీటర్ల పరిధిలోనే అనుమతిని మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఇంట్లో ఉండాల్సిన బాధ్యతను పౌరులకు గుర్తు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కరోనా అప్​డేట్స్ : ఆరుగురికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.