ETV Bharat / city

Ugadi celebrations: సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న జగన్ దంపతులు

author img

By

Published : Apr 2, 2022, 12:25 PM IST

Updated : Apr 2, 2022, 7:10 PM IST

CM Jagan couple in ugadi celebrations: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్‌ దంపతులు.. పంచాంగాన్ని ఆవిష్కరించారు. కప్పగంతు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. సీఎం జగన్ ప్రజలకు శుభాకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని.. ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని.. ఆకాంక్షించారు.

cm jagan participates in ugadi celebrations
తాడేపల్లిలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు

Ugadi Celebrations at CM Camp Office: శుభకృత్‌ నామ సంవత్సరంలో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది నవరత్నాలకు ఉపరత్నాలు వస్తాయేమో అని పంచాగకర్త వ్యాఖ్యానించారు. శుభకృత్‌ నామ సంవత్సరాది వేడుకల్లో భాగంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌ దంపతులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కప్పగంతు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. ప్రజలు సంతృప్తి చెందేలా ఈ ఏడాది పాలన ఉటుందని, గ్రహాలు అందుకు అనుకూలిస్తున్నాయని చెప్పారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న జగన్ దంపతులు

అనంతరం సుబ్బరామ సోమయాజులు..సీఎం దంపతులకు ఉగాది పచ్చడి అందించారు. ఆ తర్వాత నూతన పంచాంగాన్ని, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగాన్ని జగన్‌, భారతి ఆవిష్కరించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నవరత్నాలపై ఏర్పాటు చేసిన... కూచిపూడి నృత్యప్రదర్శనను సీఎం దంపతులు వీక్షించారు.

ఇదీ చదవండి:

Last Updated : Apr 2, 2022, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.