ETV Bharat / city

GOVERNOR, CM WISHES: 'ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలి'

author img

By

Published : Sep 9, 2021, 9:15 PM IST

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని కోరారు.

వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్
వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సామరస్యపూర్వకమైన జీవితాన్ని ప్రజలందరికీ ప్రసాదించాలని, కరోనా మహమ్మారి పరిస్థితులను అధిగమించడానికి మనందరికీ శక్తిని అందించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ... ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. విఘ్నాలు తొలగి అందరికీ విజయాలు సిద్ధించాలని ప్రార్థించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

ఇదీచదవండి.

POLAVARAM: పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.