ETV Bharat / city

కుప్పంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చింది : చంద్రబాబు

author img

By

Published : May 16, 2022, 11:37 AM IST

CBN FIRE: కుప్పంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కుప్పంలో ఓ హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని ఖండించారు.

CBN FIRE
కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చింది

CBN FIRE: కుప్పంలో ఓ హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. భోజనం అయిపోయిందని చెప్పిన హోటల్‌ సిబ్బందిపై.. వైకాపా నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి మహిళల్ని బెదిరించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. "హోటల్ తగలబెడతాం, నిర్వాహకుల్ని చంపేస్తాం అంటూ బెదిరిస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు" అని నిలదీశారు. కఠిన చర్యలతో క్రిమినల్ కార్యకలాపాలకు ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందన్నారు.

  • ఫర్నిచర్ ధ్వంసం చేసి,మహిళలను బెదిరించడం పై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి.హోటల్ నిర్వాహకులను చంపేస్తాం...హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది(2/2)

    — N Chandrababu Naidu (@ncbn) May 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.