ETV Bharat / city

'రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాస్తున్నారు'

author img

By

Published : Aug 17, 2020, 2:14 PM IST

స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణకు అడ్డు వస్తే సినీ హీరో రామ్​కు సైతం నోటీసులు ఇస్తామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు చేసిన వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

chandra babu
chandra babu

టాలీవుడ్ హీరో పోతినేని రామ్​పై విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు చేసిన వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హీరో రామ్​కు నోటీసులు ఇస్తామని బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏ విధంగా కాలరాస్తున్నారో చెప్పేందుకు ఇది మరో రుజువు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు. ప్రశ్నించే గొంతును అణచిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ - చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి

ఏపీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్​ చేస్తోంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.