ETV Bharat / city

TS News: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

author img

By

Published : Aug 20, 2021, 7:17 PM IST

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

తెలంగాణలోని వరంగల్​ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర వరంగల్​కు చేరుకుంది. ఈ సందర్భంగా కిషన్​రెడ్డికి భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తెలంగాణలోని వరంగల్... హనుమకొండ జిల్లాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్​రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాషాయ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కిషన్​రెడ్డి రాకను పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సందడి చేశారు. నాయుడు పెట్రోల్ పంప్ నుంచి రంగశాయిపేట, పోస్ట్ ఆఫీస్ మీదుగా నగరంలోని పలు కూడళ్ల గుండా జన ఆశీర్వాద యాత్ర సాగింది.

వరంగల్​లోని సీకేఎం ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించి టీకాల పంపిణీపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించి రుద్రేశ్వరునికి పూజలు చేశారు.

ఇదీ చదవండి: PETROL ATTACK: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు..పోలీసుల అదుపులో దుండగుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.