ETV Bharat / city

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్​

author img

By

Published : May 6, 2021, 4:32 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్​
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్​

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 44,639 పాఠశాలలను దశల వారీగా ఈ బోర్డుకు అనుసంధానిస్తామని వెల్లడించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ.. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. '2024-25 ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాం. మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్రంలోని 73శాతం పాఠశాలలను ప్రభుత్వమే నడుపుతోంది. ఈ రెండేళ్లలో 6,13,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.. ఇందులో నాలుగు లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారే. సీబీఎస్‌ఈలో దేశంలోని విద్యా సంస్థలతో పాటు 26 దేశాల్లోని 25 వేలకు పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి'. అని పేర్కొంది.

ఇదీ చదవండి: ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.