ETV Bharat / city

గవర్నర్‌కు రాసిన లేఖలో చంద్రబాబు చెప్పినవన్నీఅబద్ధాలే: బొత్స

author img

By

Published : Jul 19, 2020, 4:21 PM IST

Updated : Jul 19, 2020, 5:40 PM IST

గవర్నర్​కు రాసిన లేఖలో చంద్రబాబు అన్నీ అబద్ధాలే రాశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ నిర్ణయమని స్పష్టం చేశారు.

Botsa Satyanarayana about crda and 3 capitals
Botsa Satyanarayana about crda and 3 capitals

ఒకే చోట రూ. లక్ష కోట్లు ఖర్చు సరికాదని జగన్ గతంలోనే చెప్పారని మంత్రి బొత్స గుర్తు చేశారు. పార్లమెంటు స్థానాలను జిల్లాలు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీలనే జగన్ ఇప్పుడు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో చంద్రబాబు తెలుసుకోవాలి. నారాయణ కమిటీ ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు. 3 ప్రాంతాలూ అభివృద్ధి చెందాలా.. వద్దా.. చంద్రబాబు చెప్పాలి. అమరావతి రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఒకపార్టీ ఆదేశాల మేరకు అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు.

- మంత్రి బొత్స సత్యనారాయణ

ఇదీ చదవండి: నిమ్మగడ్డ వ్యవహారం... సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్

Last Updated :Jul 19, 2020, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.