ETV Bharat / city

'ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య.. అవినాశ్​​​రెడ్డిని కాపాడేందుకు వైకాపా నేతల యత్నం'

author img

By

Published : Feb 19, 2022, 1:33 PM IST

Updated : Feb 19, 2022, 3:56 PM IST

పక్కా ప్రణాళిక ప్రకారమే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దస్తగిరి అప్రూవర్‌గా మారాక తాడేపల్లిలో వణుకు మొదలైందన్నారు. వైకాపా నాయకులు సీబీఐని బ్లాక్‌మెయిల్‌ చేసే పరిస్థితికి వచ్చారని విరుచుకుపడ్డారు. అవినాష్​​రెడ్డిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ఆరోపించారు.

ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య
ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య

ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య

పక్కా ప్రణాళిక ప్రకారమే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వివేకా హత్యను మొదట గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారాక తాడేపల్లిలో వణుకు మొదలైందన్నారు. సీబీఐ విచారణను సజ్జల తప్పుపట్టడం బరితెగింపేనని దుయ్యబట్టారు. వివేకా హత్యకు అవినాష్​రెడ్డే ప్రధాన కారణమని సీబీఐ స్పష్టం చేసినా..ఆయన్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన జగన్..అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అవసరం లేదని హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవటం వాస్తవం కాదా ? అని నిలదీశారు. వైకాపా నాయకులు సీబీఐని బ్లాక్‌మెయిల్‌ చేసే పరిస్థితికి వచ్చారని విరుచుకుపడ్డారు.

"పక్కా ప్రణాళిక ప్రకారమే వివేకా హత్య. వివేకా హత్యను మొదట గుండెపోటుగా చిత్రీకరించారు. దస్తగిరి అప్రూవర్‌గా మారాకా తాడేపల్లిలో వణుకు మొదలైంది. వైకాపా నాయకులు సీబీఐని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ కోరారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. సీబీఐ విచారణ వద్దంటూ హైకోర్టులో పిటిషన్‌ వెనక్కి తీసుకున్నారు. అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు." -బొండా ఉమ, తెదేపా నేత

సీఎం జగనే నిందితుడు..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు సీఎం జగన్మోహనరెడ్డేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్​తోపాటు అతని కుటుంబ సభ్యుల్ని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అవినాశ్ రెడ్డిని సింపతితో గెలిపించుకునేందుకు వివేకానందరెడ్డిని హత్య చేసి తన సొంత మీడియాలో చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేశారని విమర్శించారు. వివేకా కుమార్తె చేసిన పోరాట ఫలితంగా నేడు ఒకొక్క నిజం వెలుగులోకి వస్తుందన్నారు. సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరించి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని రవీంద్ర డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ

Last Updated : Feb 19, 2022, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.