ETV Bharat / city

జగన్​ ప్రజావ్యతిరేక విధానాలపై అన్ని నియోజకవర్గాల్లో భాజపా నిరసనలు

author img

By

Published : Aug 29, 2022, 10:02 PM IST

We will take Modi s populist rule to the people GVL
మోదీ ప్రజాకర్శక పాలనను, జగన్ ప్రజాకంఠ కపాలన జీవీఎల్

GVL on Vinayaka Chavithi festival జగన్​ ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని నియోజకవర్గాల్లో భాజపా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎంపీ జీవీఎల్​ స్పష్టం చేశారు. సెప్టెంబర్​ 17 నుంచి అక్టోబర్​ 2 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ సుపరిపాలనపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

GVL Comments on YSRCP: వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక ఉత్సవాలపై ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. వైకాపా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. అన్ని మతాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్నారు. జగన్​మోహన్ రెడ్డి ప్రజాకంఠక పాలనపై రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఐదు వేల ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని జీవిఎల్ తెలిపారు. సెప్టెంబర్​ 17 నుంచి అక్టోబర్​ 2 వరకు మోదీ సుపరిపాలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ విస్తరణకు కృషి చేస్తామన్నారు. పొత్తుల మీద ఇప్పుడే చెప్పలేమని.. ప్రస్తుతం పార్టీ విస్తరణ మీద దృష్టి సారించామన్నారు. కేంద్రం పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. జనసేన తమ మిత్రపక్షంగా ఉందని.. దానిపై మీడియా రాద్దాంతం చేయొద్దని కోరారు. తమ కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలను పాటిస్తామన్నారు. తెదేపాతో పొత్తు అంశంపై ప్రశ్నించగా సమాదానం దాట వేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.