ETV Bharat / city

BOPPARAJU COMMENTS ON PRC: పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండా.. ఉద్యోగులను అవమానిస్తున్నారు: బొప్పరాజు

author img

By

Published : Nov 28, 2021, 4:03 PM IST

BOPPARAJU ON PRC
BOPPARAJU ON PRC

పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దుతోపాటు వివిధ అంశాలపై నిర్వహించిన కార్యవర్గ భేటీలో.. ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు (BOPPARAJU COMMENTS ON PRC) చర్చించారు. దీనిపై కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం.. ఏపీ ఉద్యోగ సంఘాల నేతల అత్యవసరంగా సమావేశమయ్యారు. 11వ పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, బకాయిల చెల్లింపు అంశాలపై కార్యవర్గ భేటీలో చర్చించినట్లు ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు(APJAC chairman bopparaju venkateswarlu on PRC) వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సాయంత్రం జేఏసీ తరఫున కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. 94 ఉద్యోగ సంఘాలతో ఇప్పటికే సమావేశమై కార్యాచరణను సిద్ధం చేసినట్లు చెప్పారు.

ఉద్యోగులను ఆర్థిక మంత్రి చిన్నచూపు చూస్తున్నారని.. అసలు ఆయన ఉద్యోగ సంఘాలతో ఏ రోజైనా చర్చించారా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. దీనిపై ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రకటన చేస్తే ఒప్పుకోబోమని.. కేంద్ర డీఏలతో కలిపి బకాయిపడ్డ డీఎలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయన్నారు. వెంకట్రామిరెడ్డి అనుభవరాహిత్యం వల్ల చేస్తున్న వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని బొప్పరాజు అన్నారు.

ఇదీ చదవండి:

Diverted Panchayat Funds: ఇదేం సర్దు'పోటు' ?.. 5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.