IAS Officers: ఐఏఎస్‌ అధికారుల పోస్టుల్లో మార్పులు.. ప్రభుత్వ ఉత్తర్వులు

author img

By

Published : May 8, 2022, 10:45 AM IST

Updated : May 8, 2022, 11:32 AM IST

IAS Officers posts changed in ap

10:42 May 08

సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి

IAS Officers: రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారుల పోస్టుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. తితిదే ఈవోగా ఆయనను రిలీవ్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తితిదే ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా వూర్తి బాధ్యతలు అప్పగించింది. మరికొందరు ఐఏఎస్​ల బాధ్యతల్లోనూ మార్పులు చేర్పులు చేసింది.

నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా సత్యనారాయణ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవిని నియమించారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ను నియమిస్తూ.. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇదీ చదవండి:

Last Updated :May 8, 2022, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.