ETV Bharat / city

10,655 మంది భక్తులకు దుర్గమ్మ దర్శనం

author img

By

Published : Oct 18, 2020, 8:00 PM IST

ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను 10,655 మంది దర్శించుకున్నారని ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఆలయానికి 8,25,100 రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

durga temple
durga temple

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 10,655 మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదాలతో 8,25,100 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

భక్తులంతా కొవిడ్ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. టికెట్ బుక్ చేసుకోకుండా వచ్చిన భక్తులకు కూడా ఇక్కడే టికెట్ ఇప్పించి అమ్మవారి దర్శనం చేయించి పంపిస్తున్నట్లు తెలిపారు. సోమవారం, మంగళవారానికి సంబంధించి ఆన్​లైన్​లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:

పిల్లలను వదల్లేక... స్వామిని దర్శించుకోలేక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.