ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

author img

By

Published : Dec 1, 2020, 9:21 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దినేష్‌ కుమార్‌, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్​ రెడ్డి, చెస్‌ చాంపియన్‌ ద్రోణవల్లి హారిక, సినీ దర్శకుడు బాబి, డ్రమ్స్‌ శివమణి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

VIPS visit tirumala in chittor district
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దినేష్‌ కుమార్‌, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్​ రెడ్డి, చెస్‌ చాంపియన్‌ ద్రోణవల్లి హారిక, సినీ దర్శకుడు బాబి, డ్రమ్స్‌ శివమణి దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. బాబి మాట్లాడుతూ... త్వరలో చిరంజీవితో చిత్రం తీయనున్నట్లు ప్రకటించారు.

అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన జన్మదినం సందర్బంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని... ఆశీస్సులు పొందానన్నారు. అధికారపక్షం, పతిపక్షం అసెంబ్లీలో సమన్వయంతో ఉండాలన్నారు. అర్థవంతమైన చర్చలతో... పజాసమస్యలను పరస్కరించేలా దృష్టి పెట్టాలన్నారు.

ఇదీ చదవండి:

తిరుమలలో వైభవంగా గరుడ సేవ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.