ETV Bharat / city

ఆహార పదార్థాల నాణ్యతా పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన తితిదే ఈవో

author img

By

Published : Jan 4, 2021, 11:24 AM IST

తిరుమలలోని ఆహార పదార్థాల నాణ్యతా పరిశోధన కేంద్రంను తితిదే అధికారులు పరిశీలించారు. నాణ్యత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Ttd EO inspecting the Food Quality Research Center
ఆహార పదార్థాల నాణ్యతా పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన తితిదే ఈవో

తిరుమలలోని ఆహార పదార్థాల నాణ్యతా పరిశోధన కేంద్రాన్ని తితిదే ఈవో జవహార్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి కలసి పరిశీలించారు. అక్కడ వినియోగించే తాగునీరు, పాలు, నెయ్యి, నూనెలు, పప్పు దినుసులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిశోధన కేంద్రం, పిండిమిల్లులను పరిశీలించారు. పలు అంశాలపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకున్న ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.